ట్విట్టర్లో 229 మిలియన్ల ఫేక్ ఖాతాలు ఉన్నాయంటూ ఆ సంస్థ కొనుగోలును వాయిదా వేసిన మస్క్.. ఇప్పుడు కొంటానన్న ధరను తగ్గించడానికి బేరాలాడుతున్నాడు. ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొంటానని డీల్ కుదుర్చుకున్న మస్క్.. 20 శాతం కంటే ఎక్కువ స్పామ్ ఖాతాలున్న కంపెనీకి అంత ధర పెట్టలేనని చెబుతున్నాడు. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ మాత్రం 5 శాతం కంటే తక్కువే స్పామ్ ఖాతాలున్నాయని చెబుతున్నాడు. వీరిద్దరి వార్ మధ్య ట్విట్టర్ షేర్ 37.39 డాలర్లకు పడిపోయింది.