బ్రేకింగ్​: ట్విట్టర్​ కొనుగోలును ఆపేసిన మస్క్​

By udayam on May 13th / 11:37 am IST

ట్విట్టర్​ను రూ.3.36 లక్షల కోట్లకు కొనుగోలు చేయాలని భావించిన తన ప్రతిపాదనను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎలన్​ మస్క్​ ప్రకటించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేస్తూ. 5 శాతం ఫేక్​ అకౌంట్లు, స్పామ్​ ఖాతాల గురించి ఆ సంస్థ ఎలాంటి సమాచారం లేకపోవడం వల్లే తాను ఈ డీల్​ను పక్కన పెట్టేశానని పేర్కొన్నాడు. తన 22.9 కోట్ల ఫాలోవర్లలో 5 శాతం ఫేక్​ ఖాతాలేనని యుఎస్​ అధికారులకు ట్విటర్​ ఫైలింగ్​ ఇచ్చినట్లు రాయిటర్స్​ పత్రిక వార్త రాయడంతోనే మస్క్​ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ట్యాగ్స్​