భవిష్యత్తులో ట్విట్టర్ సేవల్ని వినియోగించుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి రావొచ్చని ఆ సంస్థ కొత్త యజమాని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ‘సాధారణ వినియోగదారులకు ఇది ఎప్పుడూ ఉచితంగానే ఉంటుంది. కానీ ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలకు మాత్రం దీనిని ఉపయోగించాలనుకుంటే కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిందే’ అని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. దీంతో పాటు సంస్థ మేనేజ్మెంట్లోనూ మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు.