టెక్ బిలియనీర్, ట్విట్టర్, టెస్లాల అధినేత ఎలన్ మస్క్ తాజాగా భారత్లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్మహల్పై ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశాడు. హిస్టరీ డిఫైన్డ్ అనే ట్విట్టర్ యూజర్ ఆగ్రాలోని తాజ్ మహల్ అందాలు, అందులోని డిటైలింగ్ను వర్ణిస్తూ చేసిన పోస్ట్కు రిప్లై ఇచ్చిన మస్క్ ‘2007లో అక్కడ పర్యటించా. తాజ్మహల్ను చూసి మైమరిచిపోయా. అది నిజమైన ప్రపంచ వింత అనడంలో సందేహం లేదు’ అని తాజ్ మహల్ను కీర్తించాడు.