పార్టీ నాయకత్వంపై తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును వైసీపీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకుంది. ఇటీవల జరిగిన నరసాపురం జిల్లా సాధన సమితి ఉద్యమంలో సుబ్బారాయుడు.. స్థానిక వైకాపా ఎమ్మెల్యే ప్రసాదరాజుపై తీవ్ర విమర్శలకు దిగారు. దీంతో పాటు పార్టీ టికెట్ ఇవ్వకున్నా 2024 ఎన్నికల్లో పోటీకి దిగుతానని చెప్పడం కూడా ఆయనపై చర్యలకు ప్రధాన కారణం.