అధిష్టానం పై మాజీ ఎంపీ హర్షకుమార్ అసంతృప్తి

By udayam on November 24th / 9:22 am IST

కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో పార్టీ కమిటీ సభ్యుల విషయంలో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు ను నియమించడం తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలను అధిష్టానం నియమించింది. ఈ క్రమంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అధిష్టానం తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. తనకు ఇచ్చిన క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ పదవిని వద్దంటూ అధిష్టానానికి తిరస్కరణ లేఖ పంపించారు.ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయపార్టీల అధ్యక్షులు అగ్ర కులాల వారే ఉన్నారని.. ఇప్పుడు కాంగ్రెస్ సైతం ఏపీ అధ్యక్ష పదవి కూడా బ్రాహ్మణ వర్గానికి ఇచ్చారని ఆయన ఆగ్రహంతో ఉన్నారు.

ట్యాగ్స్​