ఉన్నత విద్యాశాఖలో అటెండెన్స్ విషయంలో ఎపి సర్కార్ కీలక మార్పులు చేయనున్నారు. విద్యార్థులకు సైతం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని డిసెంబర్ మొదటి వారం నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెలాఖరులోగా విద్యార్థుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి.. వచ్చే నెల ఒకటవ తేదీ నుంచే ఈ ఫేషియల్ రికగ్నిషన్ ను మొదలుపెట్టాలని విద్యా శాఖ సైతం కసరత్తును మొదలెట్టింది. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి అన్ని కోర్సుల విద్యార్థులకూ ఈ విధానం తప్పనిసరి. వీరితో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు సైతం షేషియల్ రికగ్నిషన్ ద్వారానే హాజరు నమోదు కానుంది.