ఇకపై తమ ప్లాట్ఫామ్పై పౌర, రాజకీయ పరమైన ప్రకటనల్ని అనుమతించమని సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్బుక్ వెల్లడించింది.
ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్బర్గ్ ఓ ప్రకటనను విడుదల చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ తాము ఇకపై ఎలాంటి రాజకీయ ప్రకటనలకు అనుమతులు ఇవ్వదలచుకోవట్లేదని పేర్కొన్నారు.
అయితే ఫేస్బుక్ గత ఏడాది అక్టోబర్ నుంచే అమెరికాలో ఇలాంటి రాజకీయ ప్రకటనల్ని ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ సందర్భంగా నిలిపివేసింది. ఇప్పుడు ఇదే పనిని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది.