ఏపీ: జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫేషియల్​ అటెండెన్స్​

By udayam on December 28th / 8:07 am IST

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్​ ఉద్యోగులకు జగన్​ సర్కార్​ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏపీలో ఉద్యోగులందరికీ ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ అటెండెన్స్‌ ఉండనున్నట్లు పేర్కొంది. సచివాలయం, హెచ్‌వోడీ, జిల్లాస్థాయి ఆఫీసుల్లో జనవరి 1వ తేదీ నుంచి ఈ ఫేషియల్​ అటెండెన్స్​ అందుబాటులోకి రానుంది. మిగతా అన్ని స్థాయిల ఉద్యోగులకు జనవరి 16వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా ఇదే రూల్​ వర్తించనుంది.

ట్యాగ్స్​