టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్చరణ్ను కలిసేందుకు ఓ అభిమానిగా ఏకంగా 264 కి.మీ.ల పాదయాత్ర చేశాడు. గద్వాల్కు చెందిన జైరాజ్.. అభిమాన హీరోను కలిసిన అనంతరం వరి కంకులతో తయారు చేసిన రామ్చరణ్ ఫొటోను ఆయనకు బహూకరించాడు. ఈ విషయాన్ని రామ్చరణ్ తన తన సోషల్ ఖాతలో షేర్ చేశాడు. ప్రస్తుతం రామ్చరణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూవీకి ‘అధికారి’ అనే టైటిల్ను ఫిక్స్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.