పాకిస్థాన్​ బాహుబలికి భారత్​ లో రిలీజ్​ బంద్​!

By udayam on December 30th / 9:56 am IST

పాకిస్థాన్​ బాహుబలిగా పేరు తెచ్చుకున్న మూవీ ఏ దిల్​ హై ముష్కిల్​ భారత్​ లో రిలీజ్​ చేయాలన్న ఆలోచనలకు భారత సర్కార్​ మోకాలడ్డింది. పలు బాలీవుడ్​ మూవీస్​ లో నటించిన పాక్​ నటుడు ఫవద్​ ఖాన్​ లీడ్​ పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.8 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. డిసెంబర్​ 30 ఈ మూవీని భారత్​ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్​ ప్రకటించారు. అయితే ఈ మూవీ రిలీజ్​ ను సెన్సార్​ బోర్డ్​ అడ్డుకుంది. పంజాబ్​ లో కొన్నిచోట్ల ఈ సినిమా ప్రీమియర్​ షోలు వేయగా అక్కడ గొడవలు జరిగాయని పేర్కొంది. 2011లో పాక్​ కు చెందిన ఉర్దూ సినిమా బోల్​ తర్వాత ఇప్పటివరకూ పాకిస్థాన్​ సినిమా ఒక్కటీ భారత్​ లో విడుదల కాలేదు.

ట్యాగ్స్​