దేశంలో మహిళలు పిల్లలు కనే శాతం తగ్గుతోందని జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వేలో తేలింది. గతంలో ఈ పిల్లల్ని కనే శాతం 2.2గా ఉంటే ప్రస్తుతం అది 2 శాతానికి తగ్గిందని తెలిపింది. తెలంగాణలో 1.8 శాతంగానూ, ఎపిలో 1.7 శాతానికి తగ్గిందని పేర్కొంది. బీహార్ 2.98, మేఘాలయ 2.91, ఉత్తరప్రదేశ్ 2.53, ఝార్ఖండ్ 2.26 శాతంతో ఈ లిస్ట్లో ముందున్నాయి. గర్భనిరోధక పద్దతులు వాడుతున్న వారు 67 శాతానికి పెరగడమే దీనికి కారణమని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో సిజేరియన్ డెలివరీలు పెరిగాయి.