సూర్య నటించి, నిర్మించిన జైభీమ్ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని రుద్ర వన్నియర్ సేన చేసిన ఫిర్యాదుపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హీరో సూర్య, అతడి భార్య, నిర్మాత జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్పై ఈ కేసు నమోదైనట్లు తెలిపారు. వేలచ్చేరి పోలీసులు నమోదు చేసిన ఈ కేసు విషయమై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగినా వీరిలో ఎవరూ కోర్టుకు హాజరుకాకపోవడంపై కోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.