మంటల్లో మూడు ఫ్యాక్టరీలు

By udayam on May 13th / 11:28 am IST

దేశ రాజధాని ఢిల్లీలో కీర్తి నగర్​ ఇండస్ట్రియల్​ ఏరియాలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి మూడు ఫ్యాక్టరీలలో మంటలు చెలరేగాయి. గురువారం అర్ధరాత్రి 1.50 గంటలకు ఈ మంటలు తలెత్తాయని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. దీంతో 12 అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనాస్థలంలో మంటలను అదుపు చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇక్కడ ఫర్నీచర్​, ఫ్యాబ్రికేషన్​ తయారీ ప్లాంట్లు ఎక్కువగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.

ట్యాగ్స్​