నిలిచిపోయిన సింహాద్రి, హిందూజా ప్లాంట్లు

By udayam on May 3rd / 10:16 am IST

విశాఖలోని సింహాద్రి, హిందూజా ఎన్టీపీసీ ప్లాంట్లలో ఒకేసారి విద్యుత్​ ఉత్పత్తి నిలిచిపోయింది. టెక్నికల్​ ప్లాబ్లమ్​ వల్లనే ఉత్పత్తి ఆగిందా.. లేక ఇంధన కొరత వల్ల నిలిపేశారా అన్నది తేలలేదు. ఎన్టీపీసీ సింహాద్రిలోని మొత్తం 4 యూనిట్లలో విద్యుత్​ ఉత్పత్తి ఆగిపోవడంతో 2 వేల మె.వాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో సింహాద్రి ఎన్టీపీసీ యూనిట్​కూ విద్యుత్​ సరఫరా జరగడం లేదు. విశాఖలోని కలపాల 400 కేవీ స్టేషన్​కు గ్రిడ్​ నుంచి విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

ట్యాగ్స్​