విదేశాలకు వెళ్ళే భారతీయులకు బూస్టర్ డోస్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వారికి 2వ డోస్ అనంతరం బూస్టర్ డోస్ వ్యవధిని 9 నెలల నుంచి 90 రోజులకు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది. ఇప్పటికే గత నెల 18 నుంచి దేశంలో 18 ఏళ్ళు దాటిన వారికీ కేంద్రం బూస్టర్ డోస్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మిగతా వారికి మాత్రం బూస్టర్ డోస్ గ్యాప్ 9 నెలలుగా ఉంటుందని స్పష్టం చేసింది.