టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీక్ కేసులో గుంటూరు నారాయణ విద్యాసంస్థల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి అప్రూవర్గా మారినట్లు పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి, విద్యాసంస్థల అధినేత నారాయణ చెప్పడంతోనే పేపర్ లీక్ చేసినట్లు అతడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ప్రిన్సిపల్ ఇచ్చిన వాంగ్మూలంతో నారాయణపై కేసు నమోదు చేశామని, ఈరోజు అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. నారాయణతో పాటు ఆయన భార్య రమాదేవిని సైతం అరెస్ట్ చేసి చిత్తూరుకు తీసుకొచ్చారు.