బిజెపి తీర్థం పుచ్చుకున్న ఝక్కర్​

By udayam on May 19th / 12:05 pm IST

ఇటీవలే కాంగ్రెస్​కు గుడ్​ బై కొట్టిన పంజాబ్​ పిసిసి మాజీ చీఫ్​ సునీల్​ ఝక్కర్​ ఈరోజు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కమల దళంలోకి చేరారు. పంజాబ్​ సిఎంగా అమరీందర్​ను తప్పించిన వెంటనే ఝక్కర్​ ఆ రాష్ట్రానికి సిఎం కావాలని ఉవ్విళ్ళూరారు. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్​ చన్నీకి ఆ అవకాశాన్ని ఇవ్వడంతో అప్పట్లోనే కాంగ్రెస్​ బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆపై కాంగ్రెస్​ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్​ చేసింది.

ట్యాగ్స్​