కాశీ విశ్వనాథ ఆలయ పరిసరాల్లో ఉన్న జ్ఞాన్వాపి మసీదు నీటి మడుగులో శివలింగం బయటపడిందన్న వార్తలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజ్మహల్ ఎదురుగా ఉండే నీటి కొలనులో ఫౌంటైన్లను సైతం ఆపేయాలని ఆయన కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాన్ని 1990 ల సమయంలో జరిగిన మత కల్లోలాల స్థాయికి దిగజార్చుతోందని విమర్శించారు. జ్ఞాన్వాపిలోకి ముస్లింలకు అడ్డుచెప్పొదన్న సుప్రీం తీర్పులో ఉజూ నిర్వహణకూ అనుమతి ఉందన్నారు.