ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక ఆఫర్లు తీసుకొస్తున్న టిఎస్ఆర్టీసీ.. రేపు మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తుల కోసం మరో ఆఫర్ను ప్రకటించింది. మే 8న తేదీన రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సుల్లో తల్లులకు ఉచిత ప్రయాణం ఇస్తున్నట్లు ప్రకటించింది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలతో ప్రయాణించే తల్లులు ఎలాంటి టికెట్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి, ఎండి సజ్జనార్లు తెలిపారు.