విక్రమ్ మూవీతో ప్రతీ ఇండస్ట్రీ పెద్ద హీరో తన వైపు చూసేలా చేసుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. నెక్స్ట్ మూవీ విజయ్ తో తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పుడు క్రేజీ అప్డేట్ వచ్చేసింది. తాజా అధికారిక సమాచారం మేరకు ఈ సినిమాలో దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. లోకేష్ – విజయ్ సినిమాలో తాను నటిస్తున్నానని స్వయంగా గౌతమ్ మీడియాకు వెల్లడించాడు. భారీ బడ్జెట్టుతో భారీ అంచనాల నడుమ తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది.