భారత నవల ‘ఇసుక సమాధి’కి బుకర్​ ప్రైజ్​

By udayam on May 27th / 5:30 am IST

అత్యంత ప్రతిష్టాత్మక బుకర్​ ప్రైజ్​ను భారత్​కు చెందిన హిందీ నవల రచయిత గీతాంజలి శ్రీ గెలుచుకున్నారు. ఆమె రాసిన హిందీ నవల రేత్​ సమాధి (తెలుగులో ఇసుక సమాధి)కి ఈ అవార్డు దక్కింది. హిందీతో పాటు భారతీయ భాషల్లో వచ్చిన ఒక రచనకు బుకర్​ ప్రైజ్​రావడం ఇదే తొలిసారి. దేశ విభజన సమయంలో భర్త మరణించిన ఒక 80 ఏళ్ళ మహిళ జీవితంలో జరిగిన ఘటనలపై రేత్​ సమాధి నవల వివరిస్తుంది. ఈ నవల ఇంగ్లీష్​ అనువాదం ‘టూంబ్​ ఆఫ్​ శాడ్​’కు గానూ ఈ బుకర్​ ప్రైజ్​ దక్కింది.

ట్యాగ్స్​