వాతావరణ మార్పులపై పోరాడేందుకు భారత్కు రూ.78 వేల కోట్లు ఇవ్వనున్నట్లు జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ సోల్జ్ ప్రకటించారు. యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సోమవారం ఓలాఫ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ వార్పై మాట్లాడిన మోదీ.. యుక్రెయిన్లో కాల్పుల విరమణకు భారత్ పిలుపునిస్తోందన్నారు. యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని పేర్కొన్నారు. మరోవైపు జర్మనీ మాత్రం ఉక్రెయిన్కు సైనిక సాయం కొనసాగుతుందని స్పష్టం చేసింది.