నేడు యూరప్ పర్యటనను జర్మనీ నుంచి ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీ ఛాన్స్లర్ ఒలఫ్ స్కోల్జ్ వచ్చే నెలలో జరగనున్న జి–7 సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. రష్యాను ప్రపంచ దేశాల కూటమి నుంచి దూరం పెట్టేందుకు జరుగుతున్న చర్యల్లో భాగంగా భారత్ను రష్యాకు ప్రత్యామ్నాయంగా జర్మనీ ఆహ్వానించింది. జి–7 అధ్యక్ష స్థానంలో ఉన్న జర్మనీ.. ఇండోనేషియాలో వచ్చే నెలలో జరగనున్న ఈ అగ్రరాజ్యాల సమావేశానికి భారత్ను ఆహ్వానించింది.