ఏపీకి కొత్త పీసీసీ అధ్యక్షుడిగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గిడుగు రుద్రరాజు ను నియమించారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలను అధిష్టానం నియమించింది. ఇప్పుడున్న శైలజానాథ్ ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో రుద్రరాజుకు అవకాశం ఇచ్చింది. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీని నియమిస్తూ.. ఏఐసీసీ బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఏపీలో కూడా నాయకత్వాన్ని పూర్తిగా మార్చేశారు.