ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓవర్ ద టాప్ (ఓటిటి) బిజినెస్ 2027 నాటికి రూ.330 లక్షల కోట్లకు (456.45 బిలియన్ డాలర్లు) చేరుకుంటుందని ఫియర్ మార్కెట్ సంస్థ పేర్కొంది. సెట్ టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్స్, లాప్టాప్స్, డెస్క్టాప్, టాబ్లెట్, స్మార్ట్ టివి, స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలతో కలిపి ఈ మార్కెట్ భారీ స్థాయికి చేరుకుంటుందని ప్రకటించింది. 2019లో ఈ మార్కెట్ విలువ 132.68 బిలియన్ డాలర్లుగా ఉండగా 8 ఏళ్ళలో 3 రెట్లు పెరగనున్నట్లు పేర్కొంది.