యువరాజ్​ కు చిక్కులు.. గోవా ప్రభుత్వ నోటీసులు

By udayam on November 23rd / 5:22 am IST

గోవా లోని తనకు చెందిన ‘కాసా సింగ్​’ విల్లాను పర్యాటకులకు అద్దెకు ఇస్తానని ప్రకటించిన మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​ కు చుక్కెదురైంది. ఈ ప్రకటన తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని గోవా సర్కార్​ అతడికి నోటీసులు జారీ చేసి రూ.1 లక్ష జరిమానా కూడా వేసేసింది. గోవాలో పేయింగ్ గెస్ట్ విధానంలో ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే గోవా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్-1982 ప్రకారం నమోదు చేయించుకోవాలి. అయితే యువరాజ్ ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే, ఇంటిని గెస్టుల కోసం అద్దెకు ఇస్తామని ప్రకటన ఇవ్వడంపై గోవా అధికార వర్గాలు ఇలా స్పందించాయి.

ట్యాగ్స్​