పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించిన కొత్త కార్డినల్స్లో మన దేశం నుంచి ఇద్దరు పాస్టర్లకు చోటు దక్కింది. హైదరాబాద్కు చెందిన ఆర్చిబిషప్ పూలా ఆంథోనీకి, గోవాకు చెందిన ఆర్చిబిషప్ ఫిలిపే నేరి ఫెర్రోలకు పోప్ ఫ్రాన్సిస్ ఈ అరుదైన గౌరవాన్ని అందించారు. వీరికి ఈ ఏడాది ఆగస్ట్ 27న వాటికన్లో జరగనున్న వేడుకలో కార్డినల్ హోదా దక్కనుంది. వీరిద్దరితో కలిపి దేశంలో మొత్తం కార్డినల్స్ సంఖ్య 6కు చేరనుంది. గోవా నుంచి ఎన్నికైన తొలి కార్డినేట్గా ఫెర్రో రికార్డులకెక్కారు.