న్యాయమూర్తుల నియామకం కోసం కొలిజియం సూచించిన పేర్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడంపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ’22 పేర్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపింది. కొన్ని పునరుద్ఘాటించిన (పేర్లు) వెనక్కి పంపారు. వెనక్కి పంపిన వాటిలో కొన్ని మూడోసారి కూడా పునరుద్ఘాటించబడ్డాయి. కొన్నింటిని కొలిజియం ఆమోదించనప్పటికీ పరిగణించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ అంశాలతో సంబంధం లేకుండా న్యాయమూర్తులు కేసులను విచారిస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది.