ఐదేళ్ళ క్రిందటి ఓ కేసులో గుజరాత్కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాణీకి మూడు నెలల జైలు శిక్ష పడింది. 2017లో అనుమతి లేకుండా ఆజాదీ మార్చ్ నిర్వహించారన్న కేసులో విచారణ ముగించిన మెజిస్టీరియల్ కోర్ట్ ఆయనతో పాటు మరో 11 మందిని దోషులుగా తేల్చి శిక్షల్ని ఖరారు చేసింది. జిగ్నేష్కు 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది. శిక్ష ఖరారైన వారిలో 12 మందిలో ఒకరు ఇది వరకే మరణించగా ఒకరు పరారీలో ఉన్నారు.