ఈ ఏడాది ఐపిఎల్లో అదరగొట్టేస్తున్న కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్కు చేరుకుంది. నిన్న రాహుల్ సేన లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన లో స్కోరింగ్ గేమ్లో దుమ్మరేపింది. చేసింది కేవలం 144 పరుగులే అయినా లక్నోను 13.2 ఓవర్లలో 82 పరుగులకే కుప్ప కూల్చింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ 4 వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు. ముందుగా బ్యాటింగ్ గుజరాత్ గిల్ 63, మిల్లర్ 26, తెవాతియా 22తో రాణించడంతో 144 చేసింది.