ఐపిఎల్ 15వ ఎడిషన్ విజేతగా కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ఆవిర్భవించింది. రాజస్థాన్ రాయల్స్తో నిన్న రాత్రి జరిగిన ఫైనల్స్లో గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్య ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేశాడు. 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసిన అతడు రాజస్థాన్ స్కోరును 130కే పరిమితం చేశాడు. ఆపై బ్యాటింగ్లోనూ 34 పరుగులు చేసిన అతడు గుజరాత్ ఆడుతున్న తొలి సిరీస్లోనే కప్ను అందించాడు. అంతకు ముందు టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 130 పరుగులకే ఆలౌట్ అయింది.