రాత్రికి రాత్రే దుబాయ్ లాటరీలతో కోటీశ్వరులయ్యే భారతీయుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. తాజాగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా తుంగూరు నుంచి వెళ్ళి దుబాయ్ లో పని చేస్తున్న తెలుగు వ్యక్తి అజయ్ కు అక్కడ ఏకంగా రూ.30 కోట్ల లాటరీ తగిలింది. దీంతో కలలో కూడా ఊహించని అదృష్టంతో అతడు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అజయ్ నాలుగేళ్ళ క్రితమే దుబాయ్ వెళ్ళి జ్యువెలరీ షాపులో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కేవలం 30 దిర్హాములతో కొన్న రెండు ఎమిరేట్స్ లక్కీ లాటరీ టికెట్లు అతడి దశను మార్చేశాయి.