సాధారణ పౌరులే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్లో తీవ్రవాదుల దాడులు పెరిగిపోతున్నాయి. మొన్న టివి యాంకర్ను, నిన్న హిందూ టీచర్ను కాల్చి చంపిన ఉగ్రవాదులు ఈరోజు ఓ బ్యాంక్ మేనేజర్ను కాల్చి చంపారు. కుల్గామ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఆరే మోహన్ పొరా ఎల్లాఖీ దేహతి బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్న విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి వెళ్తుండగా మరణించాడు. విజయ్ కుమార్ది రాజస్థాన్లోని హనుమాన్ నగర్ అని పోలీసులు తెలిపారు.
#WATCH | J&K: Terrorist fires at bank manager at Ellaqie Dehati Bank at Areh Mohanpora in Kulgam district.
The bank manager later succumbed to his injuries.
(CCTV visuals) pic.twitter.com/uIxVS29KVI
— ANI (@ANI) June 2, 2022