ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన గువహటి-బరౌనీ పైప్ లైన్ ను బీహార్ ఖగడియా జిల్లా బకియా గ్రామంలో దుండగులు ధ్వంసం చేసి ఆయిల్ లీక్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వందల సంఖ్యలో చమురు కోసం ఎగబడ్డారు. ఈ ఘటన తర్వాత వేల లీటర్ల చమురు రోడ్డు, పొలాలపై పడినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఐఓసీ అధికారులు తమ ఇంజనీర్లతో లీకేజీని రిపేర్ చేయించారు.