ముస్లింల పవిత్ర యాత్ర హజ్వచ్చే నెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర హజ్ కమిటీ షెడ్యూల్ను విడుదల చేసింది. జులై 3 వరకూ జరగనున్న ఈ యాత్రలో తెలంగాణ నుంచి 1822 మందికి అవకాశం దక్కింది. రెండు డోసుల కరోనా టీకాలు వేసుకున్న వారికి మాత్రమే ఈ యాత్రకు అనుమతి ఇవ్వనున్నారు. కరోనా వైరస్ కారణంగా ఏడాది కూడా 65 ఏళ్ళ లోపు వారికి మాత్రమే హజ్ కమిటీ షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. ఎపి నుంచి ఈ యాత్రకు 1200ల మంది వెళ్ళనున్నారు.