భారత స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యను వైట్ బాల్ జట్టుకు కొత్త కెప్టెన్ గా ఎన్నుకున్నట్టు సంచలన వార్తను హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యకు వన్డే, టి20 జట్టు పగ్గాలు అప్పగించడానికి రంగం సిద్ధమైనట్లు పేర్కొంది. దీనికోసం ఇప్పటికే హార్ధిక్ పాండ్య తోనూ చర్చించినట్లు, అతడు దీనిపై తన నిర్ణయం చెప్పడానికి కొంత సమయం అడిగినట్లు సమాచారం. 29 ఏళ్ళ పాండ్య భారత్ కు 66 వన్డేలు, 81 టి20లు, 11 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు.