భారత రాష్ట్ర సమితి కిసాన్ సెల్ ను ఏర్పాటు చేసిన తెలంగాణ సిఎం కేసీఆర్ దీని బాధ్యతలను హర్యానా కురుక్షేత్రకు చెందిన జాతీయ రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ కు అప్పగించారు. కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్ను నియామించారు. జాతీయాధ్యక్షుడి హోదాలో తొలి నియామక పత్రాలను వీరికి అందచేయడం విశేషం. ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్లోని రోడ్ నెంబర్ 5లో నిన్న బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు.