ఢిల్లీకి చెందిన హర్యానీ సింగర్ దివ్య ఇండోరా మిస్సింగ్ విషాదాంతమైంది. 3 రోజుల క్రితం ఆమె కనిపించకుండా పోయినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు భైరోన్ భక్ష్మని గ్రామం వద్ద ఫ్లై ఓవర్ సమీపంలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించి అది దివ్య ఇండోరాదే అని తేల్చారు. ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా తేల్చారు. మ్యూజిక్ ఆల్బమ్ చేద్దామంటూ రవి, రోహిత్లు అనే ఇద్దరు ఆమెను తీసుకెళ్ళి ఇంతటి దారుణానికి తెగబడ్డారని దివ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.