ఛార్​ధామ్​ యాత్ర: 2 వారాల్లో 39 మంది మృతి

By udayam on May 18th / 6:02 am IST

హిందువుల పవిత్ర ఛార్​ధామ్​ యాత్రకు వచ్చిన 39 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. కేవలం 2 వారాల వ్యవధిలో ఈ మరణాలు సంభవించాయని తెలిపారు. అధిక రక్తపోటు, గుండె పోటు, మౌంటైన్​ సిక్​నెస్​ల కారణాలతో భక్తులు మరణించారని పేర్కొన్నారు. చాలా మంది యాత్ర మధ్యలో ఉండగానే మరణిస్తున్నారని ఉత్తరాఖండ్​ ఆరోగ్య శాఖ డైరెక్టర్​ జనరల్​ డాక్టర్​ శైలజ భట్​ పేర్కొన్నారు. రిషికేష్​ సమీపంలో భక్తులకు ఆరోగ్య పరీక్షలు జరిపి అర్హులైన వారినే పంపిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్​