వాతావరణ శాఖ: 15 రాష్ట్రాల్లో భారీ వర్షాలు

By udayam on May 24th / 11:34 am IST

దేశవ్యాప్తంగా పంజాబ్​, హర్యానా, ఉత్తర ప్రదేశ్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఢిల్లీ, ఉత్తరాఖండ్​, జమ్మూ కశ్మీర్​, హిమాచల్​ ప్రదేశ్​లలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్​, జార్ఖండ్​, ఒడిశా, పశ్చిమ బెంగాల్​లలో వచ్చే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య భారత దేశంలో వచ్చే 5 రోజుల పాటు కుండపోత వర్షాలు పడతాయని పేర్కొంది. కేరళ, ఒడిశా, అస్సాం, మేఘాలయల్లోనూ 27–28 తేదీల్లో వర్షాలు పడతాయంది.

ట్యాగ్స్​