దేశ రాజధాని ఢిల్లీ భారీ వర్షం కుదిపేసింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన ఈ వర్షం ధాటికి రాజధానిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. భారీ వృక్షాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరాకూ తీవ్ర అంతరాయ ంఏర్పడింది. కొన్ని చోట్ల పాడుబడ్డ ఇండ్ల గోడలు కూలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ రోజంతా భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తమయ్యారు.