తెలంగాణకు భారీ వర్ష సూచన

By udayam on May 17th / 5:09 am IST

ఎండల ధాటికి అల్లాడిపోతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ అదిరిపోయే గుడ్​న్యూస్​ మోసుకొచ్చింది. అండమాన్​ నికోబర్​ దీవుల్లోకి నైరుతి రుతు పవనాలు వచ్చేశాయని ప్రకటించింది. 23 రోజుల ముందే నైరుతి దేశంలోకి ప్రవేశించిందని పేర్కొంది. వీటి రాకతో ఇప్పటికే అండమాన్​ దీవుల్లోనూ, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. మరో 4 రోజుల పాటు ఇక్కడ వర్షాలు కురవనున్నాయి. రాబోయే 24 గంటల్లో తమిళనాడు, తెలంగాణల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.

ట్యాగ్స్​