భారత టీ ఉత్పత్తుల్ని ప్రపంచ దేశాలు తిప్పి పంపిస్తున్నాయని ఇండియన్ టీ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది. అధిక సంఖ్యలో పురుగు మందులు, కెమికల్స్ ఉంటున్నట్లు తేలడంతోనే తిరిగి భారత్కు పంపిస్తున్నట్లు తెలిపింది. 2021లో 195.90 మిలియన కేజీల టీ విదేశాలకు ఎగుమతి కాగా.. ఇందులో ఎక్కువ ఎగుమతులు కామన్వెల్త్ దేశాలతో పాటు ఇరాన్కు చేరేవి. ఈ ఏడాది 300ల మిలియన్ టన్నుల తేయాకు ఎగుమతికి సిద్ధం కాగా.. చాలా వరకూ రిజెక్ట్ అవుతున్నాయని పేర్కొంది.