కుతుబ్​ మినార్​ను విష్ణుస్తంభ్​గా పేరు మార్చాలి

By udayam on May 10th / 12:45 pm IST

ఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం కుతుబ్​ మినార్​ పేరును మార్చాలంటూ మహాకాల్​ మానవ్​ సేన ఈరోజు ఆ కట్టడం వద్ద నిరసనలకు దిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ఈ కట్టడం పేరును విష్ణుస్తంభ్​ గా మార్చాలంటూ ఆ సంస్థ డిమాండ్​ చేస్తోంది. విశ్వహిందూ పరిషత్​ నేత ఈ ఏడాది మొదట్లోనే కుతుబ్​ మినార్​ను విష్ణు స్తంభంగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఈ నిరసనలు చోటు చేసుకున్నాయి. 1199–1220 మధ్య కుతుబ్​ ఉద్దీన్​ ఐబక్​ దీనిని నిర్మించారు.

ట్యాగ్స్​