పాక్​ లో భారత మహిళలను రేప్​ చేసి తల నరికేసిన దుండగులు

By udayam on December 31st / 6:14 am IST

పాకిస్థాన్​ లోని ఓ హిందూ యువతిపై దారుణం జరిగింది. సింధ్​ ప్రావిన్స్​ కు చెందిన దయా భీల్​ (40) అనే మహిళపై అత్యాచారం చేసిన నిందితులు.. ఆపై ఆమె తల నరికి చంపేశారు. ఆమె వక్షోజాలను సైతం కోసేసిన దుండగులు, ఆమె శరీరాన్ని కూడా వలిచేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై భారత్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి దేశంలోని పాకిస్థాన్​ రాయబారికి నోటీసులు జారీ చేసింది. పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీకి చెందిన భారతీయ హిందువు కృష్ణ కుమారి ఈ ఘోరం జరిగిన గ్రామానికి చేరుకుని బాధితురాలి కుటుంబానికి ధైర్యం చెప్పారు.

ట్యాగ్స్​