ఉగాండాలో దారుణ ఘటన జరిగింది. నీటిలో ఆడుకుంటున్న ఇగా పోలా అనే రెండేళ్ళ బాలుడిని మింగేసిన హిప్పో పోటమస్.. స్థానికులు రాళ్ళ దాడి చేయడంతో వెంటనే అతడిని పూర్తిగా బయటకు ఉమ్మి వేసింది. అప్పటికి బాలుడు బతికే ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. కట్వే కబటోరో టౌన్ లో ఉన్న నది వద్ద డిసెంబర్ 4న ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో బాలుడికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని స్థానికులు తెలిపారు.