2047 నాటికి క్రీడల్లోనూ ప్రపంచ నెంబర్ వన్గా ఎదగడమే భారత్ లక్ష్యమని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆ ఏడాదికి భారత్ స్వాతంత్రం సాధించి 100 ఏళ్ళు పూర్తవుతుందని అప్పటికే ప్రపంచంలోనే నెంబర్ వన్ స్పోర్ట్స్ నేషన్గా భారత్ ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా ప్రోగ్రామ్లతో భారత్ ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.