కులాంతర వివాహం చేసుకున్నారన్న కోపంతో అమ్మాయి సోదరులు వరుడ్ని హత్య చేసిన ఘటన సరూర్ నగర్లో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఈ జంట బైక్పై ప్రయాణిస్తుండగా.. అమ్మాయి సోదరులు బలమైన ఇనుప రాడ్తో వరుడు బిల్లాపురం నాగరాజు తలపై మోదారు. దీంతో అతడు స్పాట్ డెడ్ అయ్యాడు. ఘనాపూర్కు చెందిన సయ్యద్ ఆశ్రిన్ సుల్తానాను కాలేజీలోనే ప్రేమించిన నాగరాజు అనంతరం ఈ ఏడాది జనవరిలో ఆర్య సమాజ్లో వివాహమాడాడు. దీనిపై అమ్మాయి బంధువులు తరచూ నాగరాజును బెదిరింపులకు గురి చేస్తున్నారు.