చాహల్​: బెంగళూరుపై ఫైనల్​ ఆడాలనుంది

By udayam on May 25th / 4:59 am IST

తన పాత జట్టు బెంగళూరు రాయల్​ ఛాలెంజర్స్​తో కలిసి ఐపిఎల్​ 15వ సీజన్​ ఫైనల్​ మ్యాచ్​ ఆడాలనుందంటున్నాడు రాజస్థాన్​ స్టార్​ స్పిన్నర్​ యుజువేంద్ర చాహల్​. ఈ ఐపిఎల్​లో పర్పుల్​ క్యాప్​ దక్కించుకున్న అతడు 14 మ్యాచుల్లో 26 వికెట్లు తీశాడు. ఏళ్ళ తరబడి బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన అతడిని ఆ జట్టు ఈ ఏడాదికి వేలానికి వదిలేసింది దీంతో అతడిని రాజస్థాన్​ కొనుగోలు చేసింది. దీంతోనే అతడు బెంగళూరుతో కలిసి ఫైనల్​ ఆడి రాజస్థాన్​కు కప్పు అందించాలనుకుంటున్నట్లు చెప్పాడు.

ట్యాగ్స్​